5 New Corona Strain Cases Recorded In India | Total 25 New Corona Strain Cases In India

 

దేశంలో 25కు చేరిన యూకే స్ట్రెయిన్‌ కేసులు



భారత్‌లో కొత్తరకం కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. దేశంలో తాజాగా మరో ఐదుగురికి యూకే స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ సోకింది. పూణేలో నలుగురికి , ఢిల్లీలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో మొత్తంగా యూకే స్ట్రెయిన్‌ కరోనా కేసుల సంఖ్య 25కు చేరింది. బాధితులందరినీ ప్రత్యేక అబ్జర్వేషన్లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా మంగళవారం 6, బుధవారం 14 కరోనా కొత్తరకం కేసులు బయటపడిన విషయం తెలిసిందే

ఇదిలా ఉండగా.. భారత్‌లో కొత్తగా 21,821 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. 299 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తంగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,266,674కు చేరగా, కరోనా మరణాల సంఖ్య 148,738గా నమోదైంది.

Comments

Popular posts from this blog

Thapsigargin Covid Treatment, New Medicine For Corona Virus